News April 6, 2024
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు నేడు అంకురార్పణ

AP: శ్రీశైలంలో నిర్వహించనున్న ఉగాది మహోత్సవాలకు నేడు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో కైలాసగిరి నిండిపోయింది. ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రోజూ శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి విశేష వాహన సేవ నిర్వహిస్తారు.
Similar News
News November 6, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్ @2PM

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
News November 6, 2025
సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.
News November 6, 2025
ఓటేసేందుకు బిహారీల పాట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని బిహారీలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. HYDలో 10-12 లక్షల మంది బిహారీలు ఉండగా AP, TGలో కలిపి ఈ సంఖ్య 15 లక్షల మందికి పైగానే ఉంటుంది. ఇవాళ, NOV 11న పోలింగ్ కోసం ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ అయి వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. రైల్వే శాఖ 12వేల స్పెషల్ సర్వీసులు నడుపుతామని ప్రకటించినా రియాల్టీలో కన్పించక ఓటర్లు కష్టాలు పడుతున్నారు.


