News December 4, 2024
వారిని ఎస్సీల్లో చేర్చండి.. కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ

AP: రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు MP బైరెడ్డి శబరి లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని SCల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 21, 2025
పవన్కు భయపడే వారు ఎవరూ లేరు: పేర్ని నాని

AP: పవన్ కళ్యాణ్ <<18621637>>వ్యాఖ్యలపై<<>> YCP నేత, మాజీమంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ మాటలు సినిమా డైలాగుల్లా ఉన్నాయని, భయపడే వారు ఎవరూ లేరన్నారు. కూటమి MLAలు ఉత్తరాంధ్రలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పవన్ తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలను దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తమ ప్రభుత్వం వచ్చాక జైలుకు పంపుతామని హెచ్చరించారు.
News December 21, 2025
రేపు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం

TG: సీఎం రేవంత్ రేపు HYDలోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 21, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.260గా ఉంది. విజయవాడలో రూ.250, విశాఖ రూ.260, కామారెడ్డి రూ.250, నంద్యాల రూ.220-250, భీమవరంలో రూ.270గా ఉంది. కిలో మటన్ రూ.800-రూ.1000 వరకు పలుకుతోంది. అటు కోడి గుడ్ల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో ఒక గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


