News March 4, 2025
ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయింది: పయ్యావుల

AP: రాష్ట్రంలో ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయిందని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో అన్నారు. ‘రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది కలిపి రూ.1,54,065cr. రాష్ట్రం అప్పులు, వడ్డీలు రూ.63,962cr కట్టాల్సి ఉంది. జీతభత్యాలు, వడ్డీలు, అప్పుల అసలు కలిపి రూ.65,962cr ఖర్చు చేస్తున్నాం. జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకే మనకు వచ్చే ఆదాయం సరిపోతోంది. అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి’ అని అన్నారు.
Similar News
News November 17, 2025
సంబంధం లేని సబ్జెక్టులు.. టీచర్లకు టెట్ తిప్పలు

TG: టెట్ సిలబస్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో <<18279466>>టీచర్లు <<>>ఆందోళన చెందుతున్నారు. 15 ఏళ్ల కిందట వదిలేసిన సబ్జెక్టుల్లోంచి ప్రశ్నలొస్తే పరీక్ష ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు సంబంధంలేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు ఉన్నాయంటున్నారు. తమ సబ్జెక్టుల నుంచి 12 మార్కులే ఉంటే ఎలా పాస్ అవుతామని కొందరు అడుగుతున్నారు. సబ్జెక్టుల వారీగా టెట్ పెట్టాలని కోరుతున్నారు.
News November 17, 2025
ఆవు పొదుగులోనే అరవై ఆరు పిండివంటలూ..

ఆవు పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నుంచి అనేక రకాలైన వంటకాలు, పిండి వంటలను తయారు చేయవచ్చు. ఈ సామెత ఆవు పాలు, వాటి ఉత్పత్తుల యొక్క గొప్పతనాన్ని, అవి అందించే విస్తృతమైన ప్రయోజనాలను, వంటకాల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఆవు పాలు ఎన్నో రకాలైన రుచికరమైన, సాంప్రదాయకమైన ఆహార పదార్థాలకు మూలాధారమని దీని అర్థం.
News November 17, 2025
శివుడే వైరాగి.. మరి మనకు సంపదను ప్రసాదించగలడా?

శివుడే వైరాగి. పైగా కైలాసంలో ఉంటాడు. పులి చర్మాన్ని ధరిస్తాడు. మరి ఆయన సంపదలను ఇవ్వగలడా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ ఆ సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మోక్షం, సంతోషం అనే శాశ్వత సంపదలకు అధిపతి. ఇక అష్టైశ్వర్యాలకు అధిపతి అయిన కుబేరుడు, శివుని ఆశీస్సులతోనే ఆ స్థానాన్ని పొందాడు. ప్రశాంతత అనే సంపదకు మూలమైన చంద్రుణ్ని తలపై ధరించి అలా కూడా మనల్ని అనుగ్రహిస్తున్నాడు.


