News April 4, 2025
బాబు వచ్చాక ఆదాయం తగ్గింది: వైసీపీ

AP: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ నేల చూపులు చూస్తోందని వైసీపీ విమర్శించింది. ‘జగన్ హయాంతో పోలిస్తే నేడు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2023-24లో రూ.9,600కోట్లు రాగా, 2024-25లో రూ.8,800కోట్లకు పడిపోయింది. అది రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News January 3, 2026
మంచి పశుగ్రాసానికి ఉండాల్సిన లక్షణాలు

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.
News January 3, 2026
సుదర్శన చక్రం ఆవిర్భావం, విశిష్టత

రాక్షసుల ఆగడాల నుంచి లోకాన్ని రక్షించడానికి శక్తిమంతమైన ఆయుధం అవసరమని భావించిన విష్ణుమూర్తి, శివుడిని ప్రార్థించారు. శివపురాణం ప్రకారం.. శివుడే అత్యంత విధ్వంసకరమైన సుదర్శన చక్రాన్ని విష్ణువు కోసం సృష్టించి బహుకరించాడు. ఒక్కసారి ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వచ్చే ఈ దివ్యాయుధం, ధర్మస్థాపనలో కీలక పాత్ర పోషించింది. సృష్టికర్త శివుడు కాగా, దానిని ధరించి లోక కల్యాణం గావించింది మహావిష్ణువు.
News January 3, 2026
లేట్ నైట్ స్నాక్స్ తింటున్నారా?

లేట్ నైట్ స్నాక్స్ తినడం వల్ల పలు అనారోగ్యాలొస్తాయంటున్నారు నిపుణులు. ఆలస్యంగా తినడం వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. రాత్రి భోజనంలో ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల లేట్ నైట్ క్రేవింగ్స్కి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.


