News April 4, 2025
బాబు వచ్చాక ఆదాయం తగ్గింది: వైసీపీ

AP: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ నేల చూపులు చూస్తోందని వైసీపీ విమర్శించింది. ‘జగన్ హయాంతో పోలిస్తే నేడు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2023-24లో రూ.9,600కోట్లు రాగా, 2024-25లో రూ.8,800కోట్లకు పడిపోయింది. అది రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
News November 18, 2025
‘వారణాసి’లో నటించడం గొప్ప గౌరవం: ప్రియాంక

‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘తెలుగు & మలయాళ ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజాలు మహేశ్, పృథ్వీరాజ్తో కలిసి రాజమౌళి మూవీలో పనిచేయడం గొప్ప గౌరవం. మా సినిమా విడుదలకు ఏడాది ముందే అంతర్జాతీయ మీడియాతో ప్రమోట్ చేస్తున్నాం. మూవీపై పెరిగిన అంచనాలు మాలో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. దేవుడి దయతో మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరామ్’ అని రాసుకొచ్చారు.


