News October 3, 2024
డెంగ్యూ కేసుల పెరుగుదల.. వైద్య శాఖ ట్వీట్

దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ట్వీట్ చేసింది. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. కంటైనర్లు, తొట్టిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా దోమలను నివారించవచ్చని తెలిపింది. ‘వాటర్ క్యాన్స్ క్లోజ్ చేయాలి. డెంగ్యూ దోమలు పగలే కుడతాయి కాబట్టి ఫుల్ స్లీవ్ డ్రెస్సులు ధరించండి. లక్షణాలుంటే ఆస్పత్రికి వెళ్లండి’ అని పేర్కొంది.
Similar News
News January 21, 2026
ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

TG: ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా తొలి కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి(D) గాగిల్లాపూర్కు చెందిన వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగినట్లు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో బాధితుడి ఇంటికి వెళ్లి FIR నమోదు చేశామన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, పోక్సో, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బాల్య వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో బాధితుల ఇంటి వద్దే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
News January 21, 2026
భారత్లో ఆడండి.. లేదంటే బయటకు వెళ్లండి: ICC

బంగ్లాదేశ్ జట్టు T20 వరల్డ్ కప్ మ్యాచులను భారత్లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. తటస్థ వేదికలో ఆడతామన్న BCB వినతిపై ఇవాళ ICC ఓటింగ్ నిర్వహించగా, 14-2తో రిజెక్ట్ అయింది. దీంతో రేపటి లోపు తమ నిర్ణయం చెప్పాలని BCBకి అల్టిమేటం ఇచ్చింది. నో చెబితే మరో జట్టుతో రిప్లేస్ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ బంగ్లా రాకపోతే క్వాలిఫయర్స్ మ్యాచుల పాయింట్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఛాన్స్ ఎక్కువ ఉంది.
News January 21, 2026
జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు..

ముంబైలోని మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలు, తిరుమల, వెల్లూర్ స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, జమ్మూ వైష్ణో దేవి క్షేత్రాలు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. కోణార్క్ సూర్య దేవాలయం, శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయాలు విశిష్ట శిల్పకళకు, భక్తికి నిలయాలు. అరుణాచల, శ్రీకాళహస్తి క్షేత్రాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.


