News October 21, 2024
నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు?

TG: విద్యుత్ ఛార్జీలు పెంచేలా ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై నేటి నుంచి 5 రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ చేపట్టనుంది. 2024-25లో రూ.1200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని TGSPDCL/TGNPDCL కోరుతున్నాయి. HT కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు, LT కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. NOV 1 నుంచి ఛార్జీలు పెరిగే అవకాశముంది.
Similar News
News October 21, 2025
‘శుక్లాంబరధరం విష్ణుం’ అర్థమిదే..

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే!!
తెల్లని వస్త్రాలను ధరించినట్టి, విష్ణువు వలె జగమెల్లను వ్యాపించినట్టి, చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతిని కలిగినట్టి, నాలుగు చేతులు కలిగినట్టి, శాంతిగల ముఖమును కలిగినట్టి గణపతిని సకల విఘ్నములను నివారించుటకై ధ్యానించవలెను.
News October 21, 2025
ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఈ నెల 23వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ నెల 24(శుక్రవారం)న భారత్ బంద్ను విజయవంతం చేయాలని పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది. కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు దీనికి మద్దతివ్వాలని కోరింది.
News October 21, 2025
అవతరించడం, అంతరించడం ప్రకృతి ధర్మం

ఈ సమస్త చరాచరసృష్టి ఈశ్వరమయం. భగవంతుని సృష్టి. దానికి కొన్ని ప్రకృతి ధర్మాలు, సూత్రాలు, నియమాలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. దానికి మానవుడే కాదు, చివరకు ఆ పరమాత్మ కూడా ఈ ప్రకృతి ధర్మాలను మార్చలేదు. మార్చడు. అవతరించుట, అంతరించుట తిరిగి అవతరించుట ప్రకృతి ధర్మం. ఇందులో పరమాత్మ మాత్రమే సత్య స్వరూపుడని వేదాలు చెబుతున్నాయి.
<<-se>>#VedicVibes<<>>