News October 21, 2024

నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు?

image

TG: విద్యుత్ ఛార్జీలు పెంచేలా ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై నేటి నుంచి 5 రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ చేపట్టనుంది. 2024-25లో రూ.1200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని TGSPDCL/TGNPDCL కోరుతున్నాయి. HT కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు, LT కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. NOV 1 నుంచి ఛార్జీలు పెరిగే అవకాశముంది.

Similar News

News November 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 18, 2025

‘N-Bomma VS J-Bomma’ టీడీపీ, వైసీపీ విమర్శలు

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA గురించి చర్చ నడుస్తోంది. ఇదే థీమ్‌తో వైసీపీ, టీడీపీలు ట్విట్టర్ వార్‌కు దిగాయి. J-Bomma అంటూ జగన్ ఫొటోను షేర్ చేస్తూ TDP విమర్శలకు దిగింది. దీనికి కరెక్టెడ్ టూ N-Bomma అంటూ చంద్రబాబు ఫొటోను YCP కౌంటర్ ట్వీట్ చేసింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ రాసుకొచ్చింది.

News November 18, 2025

బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

image

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.