News November 12, 2024
EPF, EPS కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంచితే ఉద్యోగికి నష్టమా?

EPF బేసిక్ పే లిమిట్ రూ.15K నుంచి రూ.21Kకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ లిమిట్ దాటినవాళ్ల ఎంప్లాయీ (12%), ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (12%) EPFలోనే జమ అవుతున్నాయి. లిమిట్ లోపు ఉన్నవాళ్ల ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో 8.33% అంటే గరిష్ఠంగా రూ.1250 EPSకు వెళ్తుంది. లిమిట్ పెంచితే ఇది రూ.1749 వరకు పెరుగుతుంది. దీంతో EPF తగ్గి EPS కార్పస్ పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పింఛన్ లభిస్తుంది.
Similar News
News October 14, 2025
NHAI బంపరాఫర్.. రూ.1,000 రీఛార్జ్

వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది. ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది. ‘రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి రివార్డు అందిస్తారు. NHAI నిర్వహించే టాయిలెట్లకే ఇది వర్తిస్తుంది.
News October 14, 2025
హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్.. నేడే విచారణ!

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.
News October 14, 2025
పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.