News November 28, 2024

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

image

మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.

Similar News

News January 16, 2026

20న BJPకి కొత్త బాస్.. నితిన్ నబీన్ ఎన్నిక లాంఛనమే!

image

BJP నూతన జాతీయాధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 19న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే రోజు పత్రాల పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అవసరమైతే 20న ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే!

News January 16, 2026

పట్టుచీర కట్టిన తర్వాత..

image

* చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేస్తే సరిపోతుంది. * చీరలను కట్టిన వెంటనే కాకుండా నాలుగైదు సార్లు కట్టిన తర్వాత డ్రై క్లీనింగ్‌కి ఇస్తే సరిపోతుంది. * కొత్త చీరలను డిటర్జెంట్ పౌడర్, షాంపూలతో వాష్ చేస్తారు. అలాంటప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని ఎంచుకోవాలి. * ఎంబ్రాయిడరీ, ఇతర వర్కులు ఉన్న హెవీ చీరలను చేత్తోనే ఉతకడం మంచిది. * రెండు, మూడు చీరలు ఉతకాల్సి వచ్చినపుడు వేటికవే విడిగా ఉతకాలి.

News January 16, 2026

కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.