News May 14, 2024
ఎన్నికలు పూర్తికాగానే నెట్వర్క్ ఛార్జీల పెంపు?

టెలికాం సంస్థలు ఎన్నికల తర్వాత బిల్లులను పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. 25% వరకు ఛార్జీలు పెంచి, యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో టెలికాం ఆపరేటర్లకు ARPUలో 16% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. అయితే యూజర్లపై పెద్దగా భారం పడకపోవచ్చని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది.
Similar News
News March 16, 2026
HYDలోకి డీజిల్ బస్సులకు నో ఎంట్రీ!

TG: హైదరాబాద్ను పర్యావరణహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలోకి జిల్లాల నుంచి డీజిల్ బస్సులు రాకుండా కట్టడి చేయనుంది. ORR చుట్టూ ఆర్టీసీ టెర్మినళ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికులను నగరంలోకి చేరవేయనుంది. HYDలోని డీజిల్ బస్సులనూ జిల్లాలకు తరలించి ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే వాడతామని ఇటీవల సీఎం <<19328203>>రేవంత్<<>> చెప్పిన విషయం తెలిసిందే.
News March 16, 2026
ఇండక్షన్ స్టవ్స్ వాడుతున్నారా?

గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. వీటిని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*స్టీల్, ఐరన్ పాత్రలతో వంట చేసుకోవాలి. రాగి, అల్యూమినియం, గాజు, మట్టి పాత్రలతో సాధ్యం కాదు.
*స్టవ్ లోపల, కంట్రోల్ ప్యానల్పై నీళ్లు పడకూడదు.
*స్టవ్ చల్లబడేందుకు కింద ఫ్యాన్ ఉంటుంది. దానికి అడ్డుగా వస్తువులు పెట్టకూడదు.
*పాత్ర ఉంచాకే స్టవ్ ఆన్ చేయాలి. అవసరాన్ని బట్టి హీట్ పెంచాలి.
News March 16, 2026
నక్సలైట్ రోల్లో పీపుల్స్ స్టార్

స్వీయ దర్శకనిర్మాణంలోనే సినిమాలు చేస్తున్న పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి చాలా ఏళ్ల తర్వాత ఓ బయటి చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న హుషారు-2లో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. తన ఐడియాలజీకి దగ్గరగా ఉండటంతోనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టెంపర్ సహా అనేక చిత్రాల కోసం డైరెక్టర్లు సంప్రదించినా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇకపై ఆయన ఇతరుల సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.


