News November 22, 2024
డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 12, 2026
చివరి 2 వన్డేలకు సుందర్ ఔట్?

టీమ్ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. కివీస్ ఇన్నింగ్స్లో 20వ ఓవర్ వేస్తున్న సమయంలో గాయపడటంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. అనంతరం బ్యాటింగ్కు వచ్చినా ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో చివరి 2 ODIలు ఆడకపోవచ్చని సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 12, 2026
సోమవారం ఉపవాసం ఉంటున్నారా?

సోమవారం ఉపవాసం ఉంటే మానసిక ప్రశాంతత, స్వీయ నియంత్రణ లభిస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు, తుమ్మి పూలతో పూజించి ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించాలి. రోజంతా భక్తితో గడిపి, సాయంత్రం సాత్విక ఆహారం తీసుకుంటే కోరికలు నెరవేరి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి.
News January 12, 2026
ధనుర్మాసం: ఇరవై ఎనిమిదో రోజు కీర్తన

‘స్వామీ! మేము అడవిలో పశువులను కాచుకునే అజ్ఞానులం. లోక మర్యాదలు తెలియక మిమ్ము ‘‘కృష్ణా, గోవిందా’’ అని పిలిచాం. మా అపరాధాలు మన్నించు’ అని గోపికలు వేడుకున్నారు. పరమాత్మ తమ కులంలో జన్మించడం తమ అదృష్టమని, ఈ బంధం ఎప్పటికీ తెగనిదని భావించారు. తమ అమాయకపు భక్తిని అనుగ్రహించి, వ్రతాన్ని పూర్తి చేసే భాగ్యం ప్రసాదించమని, మోక్షాన్ని ఇచ్చే ఆ పదవిని తమకు దక్కేలా చేయమని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. <<-se>>#DHANURMASAM<<>>


