News November 22, 2024
డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 31, 2026
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో పోస్టులు

<
News January 31, 2026
సిట్ విచారణకు కేసీఆర్?

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు నందినగర్ నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన <<19006789>>విషయం తెలిసిందే<<>>. మరోవైపు కేసీఆర్కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నాయి.
News January 31, 2026
28,740 పోస్టులకు నోటిఫికేషన్

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచి FEB 14వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సైట్: https://indiapostgdsonline.gov.in/


