News May 4, 2024

జొన్నల కొనుగోళ్ల పరిమితి 12 క్వింటాళ్లకు పెంపు

image

TG: ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితితో ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలుకు ₹3180 మద్దతు ధరగా చెల్లిస్తోంది. రైతులెవరూ పంటను తక్కువ ధరకు అమ్మవద్దని, మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.

Similar News

News November 21, 2025

RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

image

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

News November 21, 2025

టాటా డిజిటల్‌లో భారీగా లేఆఫ్‌లు

image

టాటా గ్రూప్‌లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్‌‌లోనూ ఎంప్లాయీస్‌ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్‌ పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.

News November 21, 2025

UG&PG సైన్స్ స్కాలర్‌షిప్‌ నేడే లాస్ట్ డేట్

image

సైన్స్ విద్యార్థినులకు L’Oréal India అందించే స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగుస్తోంది. UG&PG ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినుల మినహా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వార్షికాదాయం 6 లక్షల్లోపు, ఇంటర్‌లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి ఉండాలి. UG విద్యార్థులకు రూ.62,500, PG & PhD విద్యార్థులకు రూ.1,00,000 వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. వెబ్‌సైట్: <>https://www.foryoungwomeninscience.co.in/<<>>