News July 4, 2024
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ₹లక్షకు పెంపు?

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతనజీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి ₹50వేలు ఉండగా ఆ మొత్తాన్ని ₹లక్షకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.
Similar News
News November 11, 2025
నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..

TG: ఇవాళ <<18244091>>జూబ్లీహిల్స్<<>> అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉ.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJP మధ్య పోటీ నెలకొంది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి నవీన్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
News November 11, 2025
ఏపీ టుడే

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ
News November 11, 2025
మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.


