News April 11, 2024
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల పెంపు!

TG: లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో 450 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 3 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్యను 35,356 నుంచి 35,806కు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అనుమతి కోరుతూ ECIకి రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ ప్రతిపాదనలు పంపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల మంది ఓటర్లున్నారు.
Similar News
News November 15, 2025
IPL: మ్యాక్సీని వదిలేసిన పంజాబ్!

ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ను రిటైన్ చేసుకోకుండా పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టింది. ఆయనతో పాటు ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, విష్ణు వినోద్ను కూడా విడుదల చేసింది. IPLలో విధ్వంసకర బ్యాటర్గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 15, 2025
ప్రెగ్నెన్సీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పటి నుంచే చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం అందుకు సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, శరీరంలోని రక్తం పరిమాణం, శారీరక, మానసికబలంపై దృష్టి పెట్టాలి. వ్యాయామం, పోషకాహారం తప్పనిసరి. థైరాయిడ్, విటమిన్ D3, విటమిన్ B12, బ్లడ్ షుగర్ టెస్టులు కూడా చేయించుకోవాలి.
News November 15, 2025
ఈ పుట్టగొడుగులు.. కిలో రూ.30 వేలు

భారత్లో లభించే పుట్టగొడుగుల్లో ఖరీదైనవి ‘గుచ్చి’(మోరెల్) పుట్టగొడుగులు. ఇవి జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుందట. ఔషధాల తయారీలో వీటిని వాడుతున్నారు. దేశీయంగా వీటి ధర KG రూ.30K-రూ.35 వేలు కాగా విదేశాల్లో KG రూ.40వేలు పైనే.✍️మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


