News April 11, 2024

రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల పెంపు!

image

TG: లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో 450 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 3 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్యను 35,356 నుంచి 35,806కు పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అనుమతి కోరుతూ ECIకి రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ ప్రతిపాదనలు పంపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల మంది ఓటర్లున్నారు.

Similar News

News October 10, 2024

ఏపీకి వెళ్లే IAS, IPS ఆఫీసర్లు వీరే..

image

ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి <<14323982>>రిలీవ్<<>> చేసింది. ఈ నెల 16 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి ఉన్నారు. తమను తెలంగాణకు కేటాయించాలని కోరగా కేంద్రం తిరస్కరించింది.

News October 10, 2024

ఒకే ఇంట్లో నలుగురు MBBSలు

image

TG: ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.

News October 10, 2024

800: 147 ఏళ్ల చరిత్రలో నాలుగోసారే

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ 823/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో 800కుపైగా పరుగులు నమోదయ్యాయి. అలాగే 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇప్పటివరకు శ్రీలంక, ఇంగ్లండ్ మాత్రమే 800కుపైగా స్కోర్లు చేశాయి. లంక ఓసారి, ఇంగ్లండ్ మూడు సార్లు ఈ ఫీట్ సాధించాయి. మరో వైపు ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి ఆరుగురు పాక్ బౌలర్లు 100కుపైగా పరుగులు ఇచ్చుకున్నారు.