News October 14, 2024
బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచడమా?: హరీశ్ రావు

TG: బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు. ‘సిద్దిపేట-జేబీఎస్ ఛార్జీ రూ.140 ఉంటే రూ.200 చేశారు. హన్మకొండ-హైదరాబాద్ సూపర్ లగ్జరీ టికెట్ రూ.300 ఉంటే రూ.420కు పెంచారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు..?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 16, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

TG: ఖరీఫ్ సీజన్లో 8,342 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అలాగే సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 16, 2025
రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు

రబీ మొక్కజొన్నను OCT-15 నుంచి NOV-15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(100-120), మధ్యకాలిక(90-100), స్వల్పకాలిక( 90 రోజుల కంటే తక్కువ) రకాలున్నాయి. రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు D.H.M.111, D.H.M.115, D.H.M.117, D.H.M.121.
☛ హైబ్రిడ్ రకాలు: DHM-103, DHM-105, DHM-107, DHM-109
☛ కాంపోజిట్ రకాలు: అశ్విని, హర్ష, వరుణ్, అంబర్ పాప్కార్న్, మాధురి, ప్రియా స్వీట్కార్న్
News October 16, 2025
భూ రక్షకుడు ఆ వేంకటేశుడే..

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. పూర్వం లోకం అంతమయ్యే సమయంలో సూర్యుడు రుద్రమూర్తి రూపంలో భూమిని మండించాడు. దీంతో చాలా ఏళ్లు వర్షాలు లేక భూమి ఎండిపోయింది. అడవులు, పర్వతాలు బూడిదయ్యాయి. ఆ తర్వాత భయంకర గాలి వీచి, భారీ వర్షాలు కురిసి, జలప్రళయం వచ్చింది. భూమి మొత్తం నీట మునిగింది. అప్పుడు హరి శ్వేత వరాహ రూపంతో సంద్రంలోకి ప్రవేశించి, పాతాళం వరకు వెళ్లి, మునిగిపోయిన భూమిని పైకి తీసుకొచ్చారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>