News January 7, 2025
తిరుమలలో పెరిగిన రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 16కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Similar News
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.
News November 18, 2025
ఎసెన్స్లతో ఎన్నో లాభాలు

ఎసెన్స్లు సీరమ్స్లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్ని ఉపయోగించి ఎసెన్స్ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్లు రెండూ స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్గా పనిచేస్తాయి.


