News April 4, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 58,864 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది.

Similar News

News January 9, 2026

NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (<>NHAI<<>>) 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్‌సైట్: https://nhai.gov.in/

News January 9, 2026

ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

image

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.

News January 9, 2026

NIT వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/