News March 19, 2024
పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.420 పెరిగి రూ.60,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరగడంతో రూ.66,330గా ఉంది. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News
News April 21, 2025
అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పిన రోహిత్

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
News April 21, 2025
IPL: టాస్ గెలిచిన కేకేఆర్

ఈడెన్ గార్డెన్స్లో KKRvsGT మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్
KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్
News April 21, 2025
‘హైదరాబాద్కు రండి’.. జపాన్ కంపెనీలకు సీఎం ఆహ్వానం

TG: భారత మార్కెట్తో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ ఆహ్వానించారు. జపాన్లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పో 2025లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గర్వకారణమని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.