News April 1, 2025
పెరిగిన ఔషధాల ధరలు

దాదాపు 900 రకాల ఔషధాల ధరలను ఇవాళ్టి నుంచి గరిష్ఠంగా 1.74% మేర పెంచినట్లు NPPA వెల్లడించింది. ఇందులో యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, షుగర్ మెడిసిన్స్ ఉన్నాయి. సవరించిన ధరల ప్రకారం అజిత్రోమైసిస్ 250Mg ఒక్కో టాబ్లెట్ రేటు ₹11.87, 500Mg ధర ₹23.97కు చేరింది. డైక్లోఫెనాక్ ₹2.09, ఇబ్రూఫెన్ 200Mg ₹0.72, 400Mg ₹1.22గా పేర్కొంది. పూర్తి లిస్టును https://www.nppaindia.nic.in/లో చూడొచ్చు.
Similar News
News January 11, 2026
సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

TG: ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ CM రేవంత్, ప్రభుత్వంపై ఫైరయ్యారు.
News January 11, 2026
చెరకు సాగు-విత్తనం ఎంపికలో జాగ్రత్తలు

చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 11, 2026
పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే..?

దేవుని ప్రసాదంగా పొందిన పసుపును పూజా గదిలో ఉంచి నిత్యం పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మరోగాలు తొలగి దేహకాంతి పెరుగుతుంది. ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. వివాహ దోషాలు ఉన్నవారు పసుపు గౌరీని పూజించాలి. వ్యాపార స్థలాల్లో పసుపు నీరు వాడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే పసుపు దానం చేయడం శ్రేయస్కరం. ఫలితంగా ఇంట్లో దైవకళ ఉట్టిపడి, సకల శుభాలు కలుగుతాయి.


