News March 14, 2025
పెరిగిన ఎండలు.. 18 జిల్లాలకు అలర్ట్

TG: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతాయని టీజీడీపీఎస్ అంచనా వేసింది.
Similar News
News November 27, 2025
Viral: చిరంజీవితో కొండా సురేఖ సెల్ఫీ

TG: మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కొండా సురేఖ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సురేఖ.. బుధవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో చూసిన మెగాస్టార్ అభిమానులు.. ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు.
News November 27, 2025
తిరుమల వెళ్లినప్పుడు దీన్ని తప్పక చూడండి

తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీకి ఎదురుగా తాళ్లపాక అర ఉంటుంది. దీన్నే సంకీర్తనా భాండాగారం అంటారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు రోజుకో కీర్తన రచించేవారట. ఆయనతో పాటు ఆయన వంశీకులు రచించిన అసంఖ్యాకమైన సంకీర్తనలన్నీ ఈ అరలోనే భద్రపరిచారు. ఈ అర బయట ఉన్న శిలా ఫలకంపై అన్నమయ్య ఉన్న చిత్రం ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు దీన్ని అస్సలు మిస్సవ్వకండి.<<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR మాజీ ఓఎస్డీ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR వద్ద OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ PSలో సిట్ విచారిస్తోంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. INC ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.


