News October 10, 2024
పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం

టెలికం కంపెనీల ఆదాయం జూన్తో ముగిసిన త్రైమాసికానికి 8% పెరిగినట్లు ట్రాయ్ వెల్లడించింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే నెలవారి సగటు ఆదాయం రూ.157.45గా ఉంది. గత మార్చికి ఇది రూ.153.54గా ఉంది. టెలికం రంగం స్థూల ఆదాయం 0.13% పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. పల్లెల్లో టెలికం వినియోగం 59.19% నుంచి 59.65%కి పెరగ్గా, పట్టణాల్లో 133.72% నుంచి 133.46%కి తగ్గింది. టెలిఫోన్ చందాదారుల సంఖ్య 1205.64 మిలియన్లుగా ఉంది.
Similar News
News December 19, 2025
జనవరి 13 నుంచి పతంగుల పండుగ

TG: సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జనవరి 13 నుంచి 18 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరగనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ షోలనూ ఏర్పాటు చేయనున్నారు. 13-15 మధ్య కైట్, స్వీట్, 13,14 తేదీల్లో డ్రోన్, 16-18 మధ్య హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతాయని టూరిజం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ తెలిపారు.
News December 19, 2025
వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.
News December 19, 2025
అధిక మాంసోత్పత్తి కోసం గిరిరాజా కోళ్లు

మాంసం కోసం పెరటి కోళ్లను పెంచాలనుకుంటే గిరిరాజా కోళ్లు చాలా అనువైనవి అంటున్నారు వెటర్నరీ నిపుణులు. ఇవి అత్యధికంగా 3కిలోల నుంచి 5కిలోల వరకు బరువు పెరుగుతాయి. అలాగే ఏటా 140 నుంచి 170 గుడ్ల వరకూ పెడతాయి. దేశీయ కోళ్లకన్నా రెండు రెట్లు అధిక బరువు పెరుగుతాయి. సరైన దాణా అందిస్తే 2 నెలల్లోనే ఏకంగా 3 కేజీలకు పైగా బరువు పెరగడం గిరిరాజా కోళ్లకు ఉన్న మరో ప్రత్యేక లక్షణం.


