News April 7, 2024
పెరిగిపోతున్న నోటా ఓట్లు.. ప్రభావం శూన్యం?

దేశంలో నిర్వహిస్తున్న ఏ ఎన్నికల్లోనైనా నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 60,00,197 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019లో ఈ సంఖ్య 65,22,772కి చేరింది. ఈ విధానాన్ని NOTA (నన్ ఆఫ్ ద ఎబౌ) పేరుతో 2013లో అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే నోటా అనేది రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపట్లేదని, ఇది కోరల్లేని పాములా తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. <<-se>>#Election2024<<>>
Similar News
News November 20, 2025
HYD: సీఎంను కలిసిన జలమండలి ఎండీ

జల సంరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్లో పొందుపరచాలని ప్రజాభవన్లో సీఎస్లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.
News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్లో పొందుపరచాలని ప్రజాభవన్లో సీఎస్లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.


