News October 19, 2024
IND vs NZ: ఈ రోజు 400 కొడితేనే..!

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ పేలవ ప్రదర్శన చేసినా రెండో ఇన్నింగ్స్లో గొప్పగానే పుంజుకుంది. ఇదే నిలకడ ఈ రోజు మొత్తం కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. పంత్, కేఎల్, సర్ఫ్రాజ్ కీలకంగా మారనున్నారు. కనీసం 300 నుంచి 400 పరుగులు చేస్తేనే ప్రత్యర్థిపై పోరాడే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే కనీసం మ్యాచ్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ పరుగులకే భారత్ చాప చుట్టేస్తే ఓటమి ఖాయం.
Similar News
News November 11, 2025
జడేజాను వదులుకోవద్దు: సురేశ్ రైనా

జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.
News November 11, 2025
కుందేళ్ల పెంపకం.. మేలైన జాతులు ఏవి?

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.


