News October 19, 2024
IND vs NZ: ఈ రోజు 400 కొడితేనే..!

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ పేలవ ప్రదర్శన చేసినా రెండో ఇన్నింగ్స్లో గొప్పగానే పుంజుకుంది. ఇదే నిలకడ ఈ రోజు మొత్తం కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. పంత్, కేఎల్, సర్ఫ్రాజ్ కీలకంగా మారనున్నారు. కనీసం 300 నుంచి 400 పరుగులు చేస్తేనే ప్రత్యర్థిపై పోరాడే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే కనీసం మ్యాచ్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ పరుగులకే భారత్ చాప చుట్టేస్తే ఓటమి ఖాయం.
Similar News
News November 19, 2025
పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.
News November 19, 2025
రాగి వస్తువులు ఇలా శుభ్రం..

ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం ఎక్కువైంది. వీటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్. దాని కోసం కొన్ని టిప్స్. శనగపిండి, పెరుగు, ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో రాగి పాత్రలను రుద్దితే మెరిసిపోతాయి. చెంచా ఉప్పుకి, రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులను తోమండి. మునుపటిలా తిరిగి తళతళలాడటం మీరే గమనిస్తారు. అలాగే నిమ్మరసం, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి తోమినా కొత్తవాటిలా కనిపిస్తాయి.
News November 19, 2025
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

దక్షిణ లెబనాన్లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.


