News September 22, 2024
దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఇండియా-ఏ జట్టు

దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు సొంతం చేసుకుంది. ఇండియా-బీపై IND-A 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టేబుల్లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రుతురాజ్ సారథ్యంలోని ఇండియా-సీ జట్టు 9 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది.
Similar News
News February 10, 2026
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్పై ఆరోపణలు

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. నిన్నటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉరివేసుకుని చనిపోయారు. పోటీ నుంచి తప్పుకోవాలని ప్రత్యర్థి నాయకులు ఆయన్ను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని T BJP చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు.
News February 10, 2026
కిలో టమాటా రూ.5.. రైతుల ఆవేదన

AP: టమాటా ధరలు రోజురోజుకీ పడిపోతుండటంతో రైతు కన్నీరు పెడుతున్నాడు. తాజాగా కర్నూల్ జిల్లా ఆస్పరి, హొళగుందలో కేజీ టమాటా ధర రూ.5కి పడిపోయింది. దీంతో రైతులు టమాటాను రోడ్లపైనే పడేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పత్తికొండలో ఇప్పటికే కొనుగోళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ధరలు ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
News February 10, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 202 పాయింట్లు పుంజుకొని 84,267 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,917 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, NTPC షేర్లు లాభాల్లో.. బజాజ్ ఫైనాన్స్, HCL టెక్, ఇండిగో, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి.


