News September 22, 2024
దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఇండియా-ఏ జట్టు

దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు సొంతం చేసుకుంది. ఇండియా-బీపై IND-A 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టేబుల్లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రుతురాజ్ సారథ్యంలోని ఇండియా-సీ జట్టు 9 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది.
Similar News
News March 10, 2026
స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేస్తున్న ఇరాన్?

విదేశాల్లోని స్లీపర్ సెల్స్ను ఇరాన్ యాక్టివేట్ చేస్తోందని US అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ నుంచి వెళ్లినట్లుగా భావిస్తున్న ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ను నిఘా వర్గాలు గుర్తించాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ సిగ్నల్స్ పంపినట్లు కనుగొన్నాయి. కోవర్ట్ ఆపరేటివ్స్/స్లీపర్ సెల్స్కు సూచనలు అందినట్లుగా అంచనావేశాయి. ఇదే నిజమైతే వారి ద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశాయి.
News March 10, 2026
తమిళనాడులో NDAకు ఎంట్రీ లేదు: స్టాలిన్

బీజేపీ ఆధ్వర్యంలోని NDAకు తమిళనాడులో ఎంట్రీ లేదని సీఎం స్టాలిన్ అన్నారు. ‘TNకు ఏమీ ఇవ్వకూడదనుకునే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? అయినా ఓట్లు అడిగేందుకు వాళ్లెలా వస్తారు? ఈ ఎన్నికలు తమిళనాడు-NDA మధ్య, DMK టీమ్కు-ఢిల్లీ టీమ్కు మధ్యే జరుగుతున్నాయి. AIADMKను మింగేయాలని బీజేపీ చూస్తోంది. ఆ పార్టీని చూస్తే జాలి కలుగుతోంది. బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు’ అని విమర్శించారు.
News March 10, 2026
రాత్రి మంచి నిద్ర కోసం..

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It


