News October 19, 2024
నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా ఇవాళ ఇండియా-A, పాకిస్థాన్-A తలపడనున్నాయి. ఒమన్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులను ఫ్యాన్ కోడ్ యాప్లో చూడొచ్చు. కాగా భారత-ఏ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నారు. జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్, రమణ్దీప్, తిలక్ వర్మ(C), అనూజ్, హృతిక్ షోకీన్, సాయి కిషోర్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్, వైభవ్, నిశాంత్.
Similar News
News October 19, 2024
బుమ్రాకు గాయం
న్యూజిలాండ్తో తొలి టెస్టులో పోరాడుతున్న భారత్కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. నిన్న బౌలింగ్ సందర్భంగా స్టార్ పేసర్ బుమ్రా చేతి వేలికి గాయమైంది. అతడి మిడిల్ ఫింగర్కు రక్తస్రావమైంది. అయినా బుమ్రా అలాగే బౌలింగ్ చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్కు దిగుతారా? లేదా? అన్నది అనుమానంగా మారింది. గాయం కారణంగా బౌలింగ్ చేయకపోతే IND పేస్ దళం బలహీనంగా మారే అవకాశం ఉంది.
News October 19, 2024
గాజాపై భీకర దాడి.. 33 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 33 మంది మరణించారు. వీరిలో 21 మంది మహిళలే ఉన్నారు. మరో 80 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,500 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్ష మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
News October 19, 2024
ఢిల్లీకి కప్పం కట్టకపోతే చిట్టి పదవి మటాష్: కేటీఆర్
TG: హైడ్రా ఎఫెక్ట్తో GHMC పరిధిలో నిర్మాణాలకు బ్రేక్ పడిందని ఓ మీడియాలో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందించారు. ‘RR Tax కట్టాలి కదా? ఢిల్లీకి మన చిట్టి కప్పం కట్టకపోతే పదవి మటాష్ కదా! మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా’ అంటూ సీఎం రేవంత్పై Xలో సెటైర్లు వేశారు.