News March 10, 2025
ట్రంప్ టారిఫ్స్తో భారత్కు మేలు: RBI మాజీ డిప్యూటీ గవర్నర్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పెంపుతో భారత్కు మేలు జరగొచ్చని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కంపెనీల మధ్య ఇది పోటీతత్వం పెంచుతుందని అంచనా వేశారు. ఫలితంగా తయారీ, ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ వనరుల నైపుణ్యంపై కంపెనీలు పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. ఆరంభంలో మార్జిన్లు తగ్గినా చివరికి మంచే జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News March 10, 2025
ఎన్టీఆర్-నెల్సన్ సినిమా టైటిల్ అదేనా?

తమిళ డైరెక్టర్ నెల్సన్తో Jr.NTR ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.
News March 10, 2025
పంత్ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

CT 2025లో రిషభ్ పంత్ను కాదని KL రాహుల్ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.
News March 10, 2025
50-30-20 రూల్ పాటిస్తున్నారా?

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటేన్ చేయండి. SHARE IT