News April 9, 2025

US, చైనా ట్రేడ్ వార్‌తో భారత్‌కు మేలు: రఘురామ్

image

ట్రంప్ టారిఫ్స్ ప్రకటన సెల్ఫ్ గోల్ అని, ఇది అమెరికా ఎకానమీని దెబ్బతీస్తుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. US, చైనా మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే భారత్‌కు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘US, చైనా, జపాన్ తదితర దేశాలతో చర్చలు జరపాలి. చైనాను వీడాలనుకునే కంపెనీలను ఆకర్షించాలి. దిగుమతులపై టారిఫ్స్ తగ్గించాలి’ అని సూచించారు.

Similar News

News April 17, 2025

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత మృతి.. విచారణకు పవన్ ఆదేశం

image

AP: అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెంలో వేటగాళ్ల ఉచ్చుకు ఇటీవల చిరుతతో పాటు దాని కడుపులోని రెండు కూనలు మరణించాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్లు, నేరస్థులపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.

News April 17, 2025

అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం కోరిన సీఎం

image

TG: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కోసం జైకా ప్రతినిధులతో CM రేవంత్ చర్చలు జరిపారు. మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, RRR ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులకు ఆర్థికసాయం కోరారు. మెట్రో రెండో దశకు రూ.11,693 కోట్లు అడిగారు. HYDను న్యూయార్క్, టోక్యో తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆర్థిక సాయం పొందేందుకు కేంద్రంతో కలిసి ప్రాజెక్టులను కొనసాగించాలని జైకా ప్రతినిధులు సూచించారు.

News April 17, 2025

విధ్వంసం.. 26 బంతుల్లో సెంచరీ

image

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌(T10)-ఇటలీలో సంచలనం నమోదైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్‌లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ 26బంతుల్లోనే శతకం బాదారు. క్రికెట్‌ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతను మొత్తంగా 37 బంతుల్లో 160* రన్స్(24 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశారు. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు 10 ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.

error: Content is protected !!