News December 22, 2024
భారత్ను బలవంతం చేయలేరు: జైశంకర్

భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.
Similar News
News December 31, 2025
ఖలీదా జియాకు సంతాపం.. మోదీ లేఖతో ఢాకా వెళ్లిన జైశంకర్

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం పట్ల సంతాపం తెలిపేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢాకా వెళ్లారు. ఆమె కుమారుడు, BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ను కలిసి ప్రధాని మోదీ పంపిన లేఖను అందించారు. భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖలీదా ఆశయాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆకాంక్షించారు. 2026లో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
News December 31, 2025
విచారణలో పోలీసులకే iBOMMA రవి ప్రశ్నలు

12 రోజుల విచారణలో పోలీసులకూ iBOMMA రవి పలు ప్రశ్నలు వేశాడని సమాచారం. తానే iBOMMA సైట్ రన్ చేస్తున్నట్లు ప్రూఫ్ ఏంటి? అని రవి ప్రశ్నించాడట. అటు అరెస్టుకు ముందూ ఈ తరహా స్పందన ఎదురైందట. VR ఇన్ఫోటెక్ పేరిట iBOMMA, బప్పంtv సైట్స్ రిజిస్టర్ అయ్యాయని తెలిసి పోలీసులు మెయిల్ చేశారు. దీంతో ‘వాటికి సర్వీస్ ఇస్తున్నానంతే, అందులో పైరసీ మూవీస్ లేవు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పంపండి’ కౌంటర్ క్వశ్చన్ చేశాడట.
News December 31, 2025
ఇంటి చిట్కాలు మీ కోసం..

* చెక్క కుర్చీలు జరిపేటప్పుడు వాటి కాళ్ళకు సాక్సులు వేస్తే నేలపై గీతలు పడకుండా ఉంటాయి.
* కత్తెర, చాకు తుప్పు పడితే వాటిని బ్లాక్ టీలో ఉంచి రెండు మూడు గంటలయ్యాక తీసి పొడి వస్త్రంతో శుభ్రపరచండి.
* ఇంటికి పెయింట్ వేసే ముందు అద్దాలను కిరోసిన్ తో తుడిస్తే మరకలు పడినా సులభంగా వదులుతాయి.
* గాజు గ్లాసులు, సీసాలను మెత్తని ఉప్పుతో శుభ్రపరిస్తే గీతలు పడకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.


