News December 22, 2024

భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్

image

భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.

Similar News

News December 14, 2025

సర్పంచ్ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

image

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,500కు పైగా, BRS 800, BJP 200 సీట్లలో విజయం సాధించారు. ఇతరులు 440 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. అటు కేటీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో BRS అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.

News December 14, 2025

జైస్వాల్ రావాల్సిన టైమ్ వచ్చిందా?

image

టీమ్ ఇండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ టీ20ల్లో అదరగొడుతున్నారు. గత 13 ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 67, 6, 75, 51, 74, 49, 70*, 13, 34, 50, 36, 29, 101గా ఉన్నాయి. దీంతో అతడిని నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. వరుసగా విఫలం అవుతున్నా గిల్‌కు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT?

News December 14, 2025

సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక..

image

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిన్నగోని కాటంరాజు అనే వ్యక్తి BRS మద్దతుతో తొలి విడతలో మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నప్పటికీ 251 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డిప్రెషన్‌కు గురైన ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.