News August 1, 2024

LAC వద్ద శాంతిస్థాపనకు భారత్, చైనా అంగీకారం

image

తూర్పు లద్దాక్‌లో LAC వివాదంపై కూలంకషంగా, నిర్మాణాత్మకంగా భారత్-చైనా మధ్య 30వ విడత చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దుల్లో శాంతిస్థాపన, దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్లు ఇరు పక్షాలు వెల్లడించాయి. 2020 జూన్‌లో గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

Similar News

News March 15, 2026

బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

image

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.

News March 15, 2026

ఏలూరు ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్: ఎస్పీ

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న యూరిన్ టెస్టు చేయగా <<19386182>>నెగటివ్<<>> వచ్చిందని, ఈరోజు టెస్టు చేయగా కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. FIRలో మొత్తం 11 మంది పేర్లను చేర్చారు.

News March 15, 2026

Viral: రూ.60వేలతో రూ.25 కోట్లు!

image

ఆదిలాబాద్‌లో 1990ల్లో కొన్న భూమి కనక వర్షం కురిపించిందని ఓ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఆదిలాబాద్‌లో మా అంకుల్ ఎకరానికి రూ.15వేల చొప్పున 4 ఎకరాలు కొన్నారు. అంటే రూ.60వేలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పట్టణం అభివృద్ధి చెందింది. డీమార్ట్ రూ.25 కోట్లు ఇచ్చి 2 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా నెలకు వడ్డీ కింద రూ.14.5 లక్షలు వస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.