News October 21, 2024
ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్-చైనా ఒప్పందం

తూర్పు లద్దాక్లో LAC వెంబడి పెట్రోలింగ్ విషయంలో భారత్-చైనా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొన్ని వారాలుగా ఇరు దేశాల దౌత్యవేత్తలు, సైన్యాధికారులు జరిపిన చర్చల్లో పురోగతి సాధించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. 2020లో గాల్వన్లో తలెత్తిన ఉద్రిక్తతల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత బలగాలు మరిన్ని పెట్రోలింగ్ పాయింట్లను యాక్సెస్ చేయగలవు.
Similar News
News January 19, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


