News September 23, 2024

లౌకికవాదం భారత్‌కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

image

లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ RN ర‌వి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. లౌకిక‌వాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

News November 18, 2025

‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

News November 18, 2025

ఓటమికి 100% బాధ్యత నాదే: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.