News September 23, 2024
లౌకికవాదం భారత్కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని తమిళనాడు గవర్నర్ RN రవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. లౌకికవాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 23, 2024
అది నా జీవితంలో హైలైట్.. థాంక్యూ మెగాస్టార్: హరీశ్ శంకర్
తన డైరెక్షన్లో ఓ యాడ్ షూట్లో నటించిన మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు హరీశ్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘2 వారాలుగా జ్వరంతో బాధపడుతున్నా. నా జీవితంలో హైలైట్ను ఎట్టకేలకు ఇప్పుడు పంచుకుంటున్నా. కేవలం ప్రకటన కోసమే అయినా ఈ అనుభవం అద్భుతం. సెట్లో ప్రతి క్షణం ఓ మ్యాజిక్. ఆ రోజును నా జీవితాంతం మర్చిపోను. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాస్’ అని పేర్కొన్నారు.
News September 23, 2024
AIలో భద్రతా లోపాలు పెనుసవాలే!
OpenAI GPT, Google జెమిని, Meta LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లోని భద్రతా లోపాలు, మానవ ఆలోచనా విధానంపై వాటి అవగాహనలేమి ప్రపంచ భద్రతకు పెనుసవాలుగా పరిణమిస్తున్నాయి. హానికర AI మోడల్స్ టెర్రరిజం, సైబర్, ఆర్థిక నేరాలు, మాల్వేర్, తప్పుడు సమాచార సృష్టి, మాదకద్రవ్యాలు-ఆయుధాల తయారీ వంటి కార్యకలాపాల్లో సహాయపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News September 23, 2024
నిద్ర పోయి రూ.9లక్షలు గెలుచుకుంది!
ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరికి ఇది సాధ్యమైంది. తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన పరుపుపై 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్. విజయవంతంగా టాస్క్ పూర్తిచేయడంతో ఆమె రూ.9లక్షలు గెలుచుకుంది.