News March 11, 2025

2027 నాటికి భారత్‌లో భారీగా ఏఐ నిపుణుల కొరత

image

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది. అయితే దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని తెలిపింది. 2027 నాటికి 10 లక్షలకు పైగా నిపుణుల కొరత ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు 23 లక్షలు దాటొచ్చని పేర్కొంది. ఏఐకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది.

Similar News

News December 1, 2025

AP న్యూస్ రౌండప్

image

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్‌లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆల‌యాల్లో రద్దీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

News December 1, 2025

TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.

News December 1, 2025

డేటింగ్ వార్తలపై మృణాల్ క్లారిటీ

image

హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ <<18371019>>డేటింగ్<<>> వార్తలు కొన్ని నెలలుగా వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. వీటిపై మృణాల్ పరోక్షంగా స్పందించారు. ‘ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల ఉచితంగా నాకు PR జరుగుతోంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం’ అని చెప్పారు. తాము మిత్రులమంటూ ధనుష్‌తో డేటింగ్ వార్తలను గతంలో ఆమె కొట్టిపారేశారు.