News August 19, 2024

మధ్యవర్తిత్వం వార్తలను తోసిపుచ్చిన భారత్

image

ర‌ష్యా – ఉక్రెయిన్ వివాద ప‌రిష్కారానికి భార‌త్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌నుంద‌నే వార్త‌ల‌ను కేంద్రం తోసిపుచ్చింది. అయితే, తాము రెండుదేశాల మ‌ధ్య సందేశాల‌ను చేర‌వేయ‌డంలో స‌హ‌క‌రించ‌గ‌ల‌మ‌ని చెప్పింది. ప్ర‌ధాని మోదీ ఆగ‌స్టు 23న కీవ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఇటీవల రష్యా వెళ్లి వచ్చిన ఆయన తాజాగా కీవ్ పర్యటన నేపథ్యంలో మధ్యవర్తిత్వం వార్తలు జోరందుకున్నాయి.

Similar News

News July 8, 2025

మహిళా సంఘాలకు రూ.12 కోట్లు విడుదల: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 14,529 ఇళ్లు మంజూరు కాగా 692 ఇళ్లకు బేస్మెంట్ పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. 532 ఇళ్లకు రూ లక్ష చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.

News July 8, 2025

తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

image

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్‌(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్‌మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News July 8, 2025

కొత్త పంచాయతీ భవన నిర్మాణాలకు ఆమోదం

image

AP: సొంత భవనాలు లేని 417 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షలతో నిర్మించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ.25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.7లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.