News February 8, 2025
హసీనా వ్యాఖ్యలతో భారత్కు సంబంధం లేదు: విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని భారత్లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమె వ్యాఖ్యలతో ఇండియాకు సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము ఎప్పుడూ కృషి చేస్తామన్నారు. బంగ్లా అంతర్గత వ్యవహారాలను INDకు ముడిపెట్టడం సరికాదని ఆ దేశ అధికారులకు తేల్చిచెప్పారు.
Similar News
News March 31, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ₹100కోట్ల మార్క్ చేరుతుందా?

బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గుతుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంద కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఉగాదికి (మార్చి 19) రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹94.38కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక భారత్లో ఈ మూవీ నెట్ కలెక్షన్లు ₹70.29Crకు చేరాయి. రోజు రోజుకూ ఆక్యుపెన్సీ తగ్గుతుండటంతో ఈ సినిమా వంద కోట్ల మార్క్ అందుకోవడం కష్టమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.
News March 31, 2026
కరెంట్ అఫైర్స్

* పారాలింపిక్ మెడలిస్ట్ షీతల్ దేవికి ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం
* తెలంగాణ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు సహా పది బిల్లులకు ఆమోదం
* బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా
* జీవితకాల కనిష్ఠాన్ని (₹95.12) తాకిన రూపాయి విలువ
* ₹3.24లక్షల కోట్ల బడ్జెట్కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం
* PMAY, టిడ్కో స్కిమ్ కింద మరో 2.50లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం
News March 31, 2026
ఆందోళన వద్దు.. రూపాయి బానే ఉంది: నిర్మల

రూపాయి <<19515449>>పతనంపై<<>> ఆందోళన అక్కర్లేదని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 27 నాటికి రూపాయి 4.1% పడిపోయిందని తెలిపారు. అయితే సౌత్ కొరియన్ వాన్ (4.6%), థాయ్ భట్ (5.5%), ఫిలిప్పైన్ పెసో (4.8%) మొదలైన కరెన్సీలు ఇంతకన్నా ఎక్కువ క్షీణించాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఆర్థికలోటును అదుపులో ఉంచడంపై భారత్కు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు.


