News March 21, 2024

‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టిన భారత్

image

హైతీలో హింస చెలరేగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టింది. 12 మంది భారతీయులను హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News April 8, 2025

త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

వాట్సాప్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చాటింగ్, షేర్ చేసిన వీడియోస్, ఫోటోలు రిసీవర్ సేవ్ చేసుకునే అవకాశం లేకుండా కొత్త ఫీచర్ డెవలప్ చేస్తుంది. దీంతో మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే స్క్రీన్‌ రికార్డింగ్, స్క్రీన్‌షాట్‌ల ద్వారా సేవ్ చేసే విషయం‌పై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం IOSయూజర్స్ కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు.

News April 8, 2025

గెజిట్ జారీ.. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం

image

వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో అవి విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే తదితర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

News April 8, 2025

పూరన్ దెబ్బకు సెహ్వాగ్ రికార్డు బద్దలు

image

KKRతో మ్యాచులో LSG విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ (36 బంతుల్లోనే 87 ) ఊచకోత కోశారు. ఈ క్రమంలో పూరన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. 1,198 బంతుల్లోనే ఆయన 2 వేల పరుగులు మార్కును అందుకున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (1,211 బంతుల్లో) రికార్డును చెరిపేశారు. అగ్ర స్థానంలో రస్సెల్ (1,120 బంతుల్లో) ఉన్నారు.

error: Content is protected !!