News September 19, 2024

ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్

image

ప‌నిఒత్తిడి కార‌ణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘ‌ట‌న‌పై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగుల‌కు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థ‌లో బాధితురాలి ప్ర‌యాణం త‌క్కువ కాలంలోనే ముగిసింద‌ని, ఈ విష‌యంలో ఆమె త‌ల్లిదండ్రులు త‌న‌కు రాసిన లేఖ‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య‌క‌ర‌మైన, స‌మ‌తుల్య ప‌ని వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

image

TG: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. <<18018400>>వివాదం<<>> నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం కూడా రిజైన్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. HNKలోని ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ, పోలీస్ ఔట్ పోస్టును తొలగించడం వీటికి బలం చేకూరుస్తున్నాయి. అటు సురేఖ BC నేత కావడంతో అధిష్ఠానం అంత ఈజీగా పదవి నుంచి తొలగిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

News October 16, 2025

రిజర్వేషన్లు 50% మించొద్దనడం సరికాదు: సింఘ్వీ

image

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తక్షణం జోక్యం చేసుకోవాలని TG తరఫున సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచామని, రిజర్వేషన్లు 50 శాతం మించరాదనడం సరికాదని వాదించారు.

News October 16, 2025

ట్రాఫిక్‌లోనే జీవితం అయిపోతోంది!

image

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పెరిగిపోయింది.