News November 24, 2024
పట్టు బిగించిన భారత్.. ఆసీస్ 12/3

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 5, 2025
ఇంటి చిట్కాలు

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
News November 5, 2025
రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
News November 5, 2025
ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించవచ్చా?

దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే దీపాన్ని మరో దీపంతో వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోనే తిరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఇలా చేస్తే మొదటి దీపం ఆకర్షించిన ప్రతికూలత రెండవ దీపానికి చేరుతుంది. దీనివల్ల ఆ ప్రతికూల శక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మీ చుట్టూర వ్యాపిస్తుంది. ఇలా జరగకూడదన్నా, అశుభ సంఘటనల నుంచి బయటపడలన్నా ఈ తప్పు చేయకూడదు’ అని సూచిస్తున్నారు.


