News November 24, 2024
పట్టు బిగించిన భారత్.. ఆసీస్ 12/3

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
News December 3, 2025
SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.
News December 3, 2025
VKB: అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే చర్యలు: SP

స్థానిక సంస్థల ఎన్నికల ముగిసే వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. వికారాబాద్ పోలీస్ కేంద్ర కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులందరూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు సభలు, సమావేశాలు ర్యాలీలో నిషేధించామన్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు.


