News November 7, 2024

అమెరికా ఎన్నికల్లో ‘భారతీయం’.. ఆరుగురి గెలుపు

image

2020 US ఎన్నికల్లో ఐదుగురు ఇండో-అమెరికన్లు గెలవగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా డెమొక్రటిక్ పార్టీ నుంచే విజయ కేతనం ఎగురవేశారు. వారిలో కాలిఫోర్నియా నుంచి అమీ బెరా, రో ఖన్నా(మూడోసారి), మిచిగాన్ నుంచి థానే దార్, ఇల్లినాయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి(థర్డ్ టైమ్), వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ ఉన్నారు. వర్జీనియా నుంచి తొలిసారి గెలిచిన భారతీయ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం రికార్డు సృష్టించారు.

Similar News

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

News November 25, 2025

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

image

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.