News August 26, 2024
టెలిగ్రామ్పై భారత్ విచారణ.. అక్రమాలు తేలితే నిషేధం

గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. యాప్లో P2P(పర్సన్ టు పర్సన్) కమ్యూనికేషన్లను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిశీస్తున్నట్లు ఓ GOVT అధికారి వెల్లడించారు. దర్యాప్తు తర్వాత అక్రమాలు తేలితే యాప్పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపారు. యాప్ ఫౌండర్ దురోవ్ను ఫ్రాన్స్ పోలీసులు <<13941531>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 7, 2025
బోర్లు ఇంటికి ఏ దిశలో ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. బోర్లు ఇంటి ప్రాంగణంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలో ఉండటం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అలా సాధ్యంకాని పక్షంలో కనీసం తూర్పు, ఉత్తర దిక్కులలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఈ నియమాలు పాటించేవారికి అదృష్టం, అభివృద్ధి, సంపద, ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని, వాస్తుకు సంబంధించి దోషాలు కలగవని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.


