News February 22, 2025
టర్కీ అధ్యక్షుడిపై భారత్ ఆగ్రహం

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇటీవల పాక్లో పర్యటించినప్పుడు కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రజల ఆశల్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఆ మాటలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ‘కశ్మీర్ అనేది పూర్తిగా మా సార్వభౌమత్వంలోనిది. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. టర్కీ రాయబారి వద్ద మా నిరసనను వ్యక్తం చేశాం’ అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
Similar News
News January 22, 2026
ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు పెట్టరా?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి ఏడాదిన్నర కావొస్తోంది. చివరగా 2024 అక్టోబర్లో ఇక్కడ భారత్-బంగ్లాదేశ్ టీ20 జరిగింది. చివరి వన్డే 2023 WCలో, చివరి టెస్టు 2024 జనవరిలో జరిగాయి. అదే సమయంలో వైజాగ్ స్టేడియం మహిళల ప్రపంచకప్తో పాటు చాలా మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 కూడా అక్కడే జరగనుంది. దీంతో హైదరాబాద్లో మ్యాచులు నిర్వహించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
News January 22, 2026
డ్రాగన్ ఫ్రూట్ సాగు.. అనువైన నేలలు, నాటే సమయం

డ్రాగన్ ప్రూట్ పంట ఏ నేలలోనైనా పండుతుంది. అయితే రాళ్ల భూమి, ఎర్ర భూములు ఎక్కువ అనుకూలం. పంటను బెడ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటను నాటుకోవడం శ్రేయస్కరం. ఈ నెలల్లో కాయను కత్తిరించిన మొక్క నుంచి కొమ్మను మనం స్వయంగా చూసి తెచ్చుకొని నాటితే అది 6 నుంచి 9 నెలల్లో కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటే మొక్కలు బతికే అవకాశం ఎక్కువ.
News January 22, 2026
నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్

AP: నేడు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు హెలికాప్టర్లో కోటప్పకొండకు చేరుకోనున్నారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గం మధ్యలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత కోటప్పకొండ-కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ సమీక్ష చేయనున్నారు.


