News September 1, 2025
USతో భారత్ ఏకపక్ష వాణిజ్యం చేస్తోంది: ట్రంప్

భారత్ దశాబ్దాలుగా USతో ఏకపక్షంగా భారీ వాణిజ్యం చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇండియా తన వస్తువులను USకు భారీ స్థాయిలో విక్రయిస్తోంది. అమెరికానే ఆ దేశానికి అతిపెద్ద కొనుగోలుదారు. US మాత్రం ఇండియాలో అధిక టారిఫ్స్తో తక్కువ బిజినెస్కే పరిమితమైంది. ఇప్పుడు సుంకాలు తగ్గిస్తామని భారత్ చెప్పినా సమయం దాటిపోయింది. అటు రష్యా నుంచి ఆయిల్ కొంటూ మమ్మల్ని టారిఫ్స్ తగ్గించమనడంలోనూ ఉపయోగం లేదు’ అని అన్నారు.
Similar News
News September 4, 2025
సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.
News September 4, 2025
ఒకటే క్లాస్: ఒకరి ఫీజు రూ.10లక్షలు.. మరొకరికి ఫ్రీ

రిజర్వేషన్ల కారణంగా ఒకే క్లాసులోని విద్యార్థులు వేర్వేరు ఫీజులు చెల్లించడాన్ని ఓ ప్రొఫెసర్ Xలో లేవనెత్తారు. పుణేలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ ఫీజు చార్టును ఆమె షేర్ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీకి రూ.10L, EBC & OBC విద్యార్థులకి రూ.6 లక్షలు ఫీజు చెల్లించాలని ఉంది. అదే SC&ST వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. ‘ఇది సమానత్వం అనుకుంటారా?’ అని ట్వీట్ చేయగా వైరలవుతోంది.
News September 4, 2025
క్యాబినెట్ భేటీలో సుగాలి ప్రీతి కేసు ప్రస్తావన

AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రీతి ఫ్యామిలీకి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక పవన్ తన కూతురి కేసును పట్టించుకోవడం లేదని ఇటీవల ప్రీతి తల్లి ఆరోపించారు.