News October 15, 2025
GDP గ్రోత్లో ప్రపంచంలోనే నంబర్ వన్గా భారత్

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(IMF) 2025కు గాను ఇండియా GDP గ్రోత్ను రివైజ్ చేసింది. ఈ ఏడాదికి 6.4% గ్రోత్ ఉంటుందని పేర్కొన్న IMF దానిని 6.6%కు పెంచింది. 2026లో అది 6.2% ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికం. గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది 3.2% కాగా, వచ్చే ఏడాది 3.1%కు తగ్గొచ్చంది. US గ్రోత్ ఈ ఏడాది 2.0% ఉండగా 2026లో 2.1%కు పెరగొచ్చని తెలిపింది.
Similar News
News October 15, 2025
ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

IRCTC 16 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc హాస్పిటాలిటీ, BBA, MBA, BSc హోటల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల వారు ఈనెల 16, 17 తేదీల్లో కోల్కతాలోని IRCTC జోనల్ ఆఫీస్లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: www.irctc.com
News October 15, 2025
AP న్యూస్ అప్డేట్స్

* తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న పుష్పయాగం. 29న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, 30న ఆర్జిత సేవలు రద్దు.
* రోగులు, క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు కొత్తగా 190 ‘108’ వాహనాలను అందుబాటులోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
* విజయనగరం జిల్లాలో JSW సంస్థ రూ.531.36 కోట్లతో 1166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్కు ప్రభుత్వం అనుమతి
News October 15, 2025
ఏటా లక్షమంది ఉద్యోగులకు AI శిక్షణ: TCS

IT దిగ్గజం TCS సంస్థ తమ ఉద్యోగులకు AIలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏటా లక్షమంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ CTO హారిక్ విన్ తెలిపారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం AI టూల్స్తో ప్రయోగాలు, హ్యాకథాన్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి సంస్థ ఇలాగే చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం TCSలో దాదాపు 5.93 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.