News May 22, 2024
ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్కు 39వ స్థానం

ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్ 39వ స్థానం పొందింది. తొలి స్థానంలో అమెరికా నిలువగా.. స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యయాల పరంగా మన దేశానికి 18వ ర్యాంక్, విమాన రవాణాలో 26వ స్థానం, రోడ్లు- నౌకాశ్రయాల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్ ముందు స్థాయికి చేరినట్లు WEF నివేదిక పేర్కొంది.
Similar News
News September 17, 2025
ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానం

*మోదీ గుజరాత్లోని వాద్నగర్లో 1950లో జన్మించారు.
*8 ఏళ్ల వయసులో RSSలో చేరి.. 15 ఏళ్లు వివిధ బాధ్యతలు చేపట్టారు.
*1987లో BJP గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
*2001లో శంకర్సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ మధ్య వివాదాలు ముదరడంతో మోదీని CM పదవి వరించింది.
*పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 2014, 2019, 2024లో దేశ ప్రధానిగా హ్యాట్రిక్ నమోదు చేశారు.
News September 17, 2025
బుమ్రాకు రెస్ట్?

ఆసియా కప్లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.
News September 17, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<