News October 21, 2024

US కంటే ఇండియా మార్కెట్ల పనితీరు భేష్: మార్క్ మోబియస్

image

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే వర్ధమాన మార్కెట్లు రెండింతల వృద్ధి రేటు సాధిస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ తెలిపారు. అమెరికా మార్కెట్ల కంటే ఇండియా మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు. ‘భవిష్యత్తులో సెమీకండక్టర్ ప్రొడక్షన్‌లో భారత్ లీడర్‌గా ఎదుగుతుందనే నమ్మకముంది. అనేక పెద్ద సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నాయి’ అని NDTV సమ్మిట్‌లో పేర్కొన్నారు.

Similar News

News March 15, 2025

వాళ్లకు కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక

image

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CM రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతపెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫాంహౌస్‌లలో డ్రగ్స్ పార్టీలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామని వెల్లడించారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.

News March 15, 2025

క్రోమ్ యూజర్లకు అర్జెంట్ వార్నింగ్!

image

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో రెండు వల్నరబిలిటీస్‌ను గమనించామని CERT-In తెలిపింది. లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ అవ్వకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసేందుకు అవకాశముందని తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారీ కోడ్‌ను పంపించి మోసగించొచ్చని, వ్యక్తిగత సమాచారం దొంగిలించొచ్చని వెల్లడించింది.

News March 15, 2025

గిరిజనేతర మహిళతో పెళ్లి.. మాజీ ఎంపీకి షాక్!

image

ఒడిశాలోని బీజేడీ నేత, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి షాక్ తగిలింది. గిరిజనేతర అగ్రకుల మహిళను ఆయన పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన ఆయన తెగ ‘భటారా సమాజ్‌’ ప్రదీప్‌ను వెలివేస్తున్నట్లు ప్రకటించింది. తమ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తెగ నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారని, అందుకే వెలివేయాల్సి వస్తోందని వివరించింది. ప్రదీప్ 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు.

error: Content is protected !!