News March 9, 2025
4 క్యాచ్లు మిస్ చేసిన భారత్

CT ఫైనల్లో భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. కివీస్ బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్లను వదిలేశారు. షమీ, అయ్యర్, రోహిత్, గిల్ క్యాచ్లను వదిలేయడంతో కివీస్ నెమ్మదిగా స్కోర్ పెంచుకుంటూ వెళ్తోంది. జట్టులో అద్భుతమైన క్యాచ్లు అందుకొనే ఫీల్డర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZ స్కోర్ 37.5 ఓవర్లకు 165/5గా ఉంది.
Similar News
News December 2, 2025
నితీశ్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు: అశ్విన్

రాంచీ వన్డేకు ఆల్రౌండర్ నితీశ్ను సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హార్దిక్ లేని టైంలో నితీశ్ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్షన్ టీంను ప్రశ్నించారు. జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. హార్దిక్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలరని, అవకాశాలిస్తే మెరుగవుతారన్నారు. ఇలా జరగలేదంటే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
News December 2, 2025
డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

1912: సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1985 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1996: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం (ఫొటోలో)
* జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
News December 2, 2025
శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

‘దిత్వా’ తుఫానుతో నష్టపోయిన శ్రీలంకకు అండగా ఉంటామని PM మోదీ తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు నిరంతరం సాయం అందిస్తామన్నారు. శ్రీలంకలో తుఫాను బీభత్సానికి 300మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది శిబిరాల్లో గడుపుతున్నారు. అటు విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలు, సామగ్రిని పంపిన భారత్కు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు.


