News August 19, 2024

జనాభా నియంత్రణపై భారత్ దృష్టి పెట్టలేదు: నారాయణమూర్తి

image

ఎమర్జెన్సీ నాటి నుంచి భారత్ జనాభా నియంత్రణపై దృష్టి పెట్టలేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశానికి జనాభా పెరుగుదల భారంగా మారిందని పేర్కొన్నారు. ‘తలసరి భూమి లభ్యత, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాల్లో భారత్ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా, బ్రెజిల్, చైనా వంటి దేశాలకు తలసరి భూమి లభ్యత తక్కువే. మనకి ఆ పరిస్థితి లేదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News November 28, 2025

MHBD జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

MHBD, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా.. మిగిలిన 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మహిళలు 2,83,064 ఉండగా, 2,73,682 మంది పురుషులు, 24 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీ, 4110 వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు కాగా.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

News November 28, 2025

అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

image

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2025

స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

image

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.