News October 18, 2024
భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా

న్యూజిలాండ్తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.
Similar News
News December 6, 2025
గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలి: పవన్

AP: అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


