News October 15, 2025
UN HRC మెంబర్స్గా ఇండియా, పాకిస్థాన్

ఐక్యరాజ్య సమితి 2026-28కి గాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ను ఎన్నుకుంది. మెంబర్స్గా అంగోలా, చిలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాక్, స్లోవేనియా, SA, UK, వియత్నాంను ఎన్నుకుంది. నిత్యం మానవ హక్కులను కాలరాసే పాక్లాంటి దేశానికి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 15, 2025
అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>
News October 15, 2025
పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.
News October 15, 2025
నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

అతి పెద్ద దేశవాళీ క్రికెట్ సమరం ‘రంజీ ట్రోఫీ 2025-26’ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ 91వ ఎడిషన్లో 38 జట్లు తలపడుతున్నాయి. విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్గా, కేరళ జట్టు రన్నరప్గా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచులు జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఖేల్ టీవీలో లైవ్ చూడొచ్చు. ఈ సీజన్లో మొత్తం 138 మ్యాచులు జరగనున్నాయి. అత్యధికంగా ముంబై జట్టు 42సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచింది.