News September 13, 2025
ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్కాట్ చేయాలి: రాజా సింగ్

పాకిస్థాన్తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్లో రేపు జరిగే మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
Similar News
News February 10, 2026
కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.
News February 10, 2026
HYD ఉద్యోగులకు గుడ్న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

కొత్త ఇన్కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
News February 10, 2026
చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.


