News May 4, 2024

‘నేపాల్ కరెన్సీపై భారత ప్రదేశాలు’.. అసలు వివాదం ఏంటి?-1/2

image

కొత్త రూ.100 కరెన్సీలో భారత్‌లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను ప్రింట్ చేయనున్నట్లు నేపాల్ ప్రకటించడం వివాదాస్పదమైంది. బ్రిటిషర్ల కాలం నుంచే ఈ వివాదం ఉంది. కాలాపానీ ప్రాంతంలో ప్రవహించే కాళీ నది ఇరు దేశాలకూ సరిహద్దు. నేపాల్ రాజ్యానికి బ్రిటిషర్లకు మధ్య 1816లో తొలిసారిగా దీనిపై ఒప్పందం జరిగింది. కాళీ నది ప్రవాహ తీరులో మార్పు, నది పుట్టుకపై భిన్నవాదనలు సమస్యగా మారాయి.

Similar News

News November 20, 2025

రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండో సారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. బేబీ బంప్‌తో పింక్ కలర్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ 2022లో కుమారుడికి జన్మనిచ్చారు. అతడికి ‘వాయు’ అని నామకరణం చేశారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురే సోనమ్.

News November 20, 2025

రేవంత్ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం: హరీశ్ రావు

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసును పూర్తి పారదర్శకతతో నిర్వహించామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. KTR ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు. ‘KTRపై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ ఇది. ప్రశ్నించే గొంతులను CM రేవంత్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. KTRకు BRS అండగా ఉంటుంది. రేవంత్ దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని ట్వీట్ చేశారు.

News November 20, 2025

నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

image

HYD నాంపల్లి సీబీఐ కోర్టులో YCP అధినేత జగన్ విచారణ ముగిసింది. కోర్టులో ఆయన 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. విదేశీ పర్యటన పిటిషన్‌కు సంబంధించి జగన్ కోర్టుకు హాజరయ్యారని, ఛార్జ్‌షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని ఆయన లాయర్ తెలిపారు.