News May 4, 2024
‘నేపాల్ కరెన్సీపై భారత ప్రదేశాలు’.. అసలు వివాదం ఏంటి?-1/2

కొత్త రూ.100 కరెన్సీలో భారత్లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను ప్రింట్ చేయనున్నట్లు నేపాల్ ప్రకటించడం వివాదాస్పదమైంది. బ్రిటిషర్ల కాలం నుంచే ఈ వివాదం ఉంది. కాలాపానీ ప్రాంతంలో ప్రవహించే కాళీ నది ఇరు దేశాలకూ సరిహద్దు. నేపాల్ రాజ్యానికి బ్రిటిషర్లకు మధ్య 1816లో తొలిసారిగా దీనిపై ఒప్పందం జరిగింది. కాళీ నది ప్రవాహ తీరులో మార్పు, నది పుట్టుకపై భిన్నవాదనలు సమస్యగా మారాయి.
Similar News
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 7, 2025
వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.
News November 7, 2025
‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.


