News June 20, 2024

IT స్టార్టప్‌లలో భారత్‌కు ఆరో స్థానం

image

భారత్‌లోని 3,600 IT స్టార్టప్‌ల ద్వారా గత ఏడాది $850M ఆదాయం వచ్చినట్లు నాస్కామ్ వెల్లడించింది. వాటిలో గత ఏడాదే 480 సంస్థలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రంగంలో IND ఆరో స్థానంలో ఉందని, త్వరలో థర్డ్ ప్లేస్‌కు చేరుకుంటుందని పేర్కొంది. 2014-22 మధ్య AI బేస్డ్ స్టార్టప్‌లు 62% పెరిగాయంది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్, రోబోటిక్స్ కేటగిరీల్లో భారీగా స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది.

Similar News

News November 4, 2025

12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఇలా చేయండి

image

ఓపెన్ ఏఐ కంపెనీ 12 నెలల పాటు ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను <<18129528>>ఫ్రీగా<<>> అందిస్తోంది. ఇందుకోసం ఇలా చేయండి.
*ChatGPT యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
*యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Try Go, Freeపై క్లిక్ చేయాలి
*ఆ తర్వాత Upgrade to Goపై క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
*రూ.2 డెబిట్ అయి వెంటనే క్రెడిట్ అవుతాయి.
NOTE: ప్లాన్ యాక్టివేట్ అయ్యాక ఆటో రెన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.

News November 4, 2025

ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం

image

TG: పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.

News November 4, 2025

నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

image

TG: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో విడత విచారణ చేపట్టనున్నారు. 6, 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌, 7, 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను రెండు సార్లు విచారించనున్నారు. తొలుత పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అంతకుముందు తొలి విడతలో <<17912398>>ఇద్దరు<<>> ఎమ్మెల్యేలను విచారించిన సంగతి తెలిసిందే.